Pages

Wednesday 27 June 2012

రామాయణం @ కధ -92


ఈ సమయంలోనే లంకా పట్టణంలో ఉన్న ప్రజలు ఒకరితో ఒకరు " ఆ శూర్పణఖ జుట్టు తెల్లబడిపోయి వృద్ధురాలు అయిపోయింది, ఒళ్ళు ముడతలు పడిపోయింది, భయంకరమైన, వికృతమైన స్వరూపంతో ఉంటుంది, జారిపోయిన కడుపు ఉన్నది, కఠినమైన మాట కలిగినటువంటిది. అటువంటి శూర్పణఖ మన్మదుడితో సమానమైన ఆకృతి కలిగినవాడిని, అంత మధురముగా మాట్లాడగలిగినవాడిని, అటువంటి సౌందర్య రాశిని, చక్కటి నడువడి కలిగినవాడిని, సర్వ కాలముల యందు ధర్మమును అనుష్టించేవాడు అయిన రాముడిని ఏ ముఖం పెట్టుకొని కామించింది? రాముడిని పొందాలన్న కోరిక ఎలా కలిగింది? ఆ రాముడు వైముఖ్యాన్ని ప్రదర్శిస్తే, కడుపులో కక్ష పెంచుకుని సీతాపహరణానికి దారితీసేటట్టుగా రావణుడి మనస్సు వ్యగ్రత పొందేటట్టుగా ఎలా మాట్లడగలిగింది?  రావణుడు ఎంత మూర్ఖుడు, రాముడు అరణ్యంలో 14,000 మంది రాక్షసులని, ఖర-దూషణులని సంహరించాడు. అలాంటివాడితో సంధి చేసుకుందాము అన్న ఆలోచన లేకుండా శూర్పణఖ మాటలు విని సీతని అపహరించడానికి వెళ్ళాడు. 


పోని అప్పటికి రాముడు అంత పరాక్రమము ఉన్నవాడని రావణుడు తెలుసుకోలేకపోయాడు అని అనుకుందాము. కాని రాజ్యభ్రష్టుడై అన్నగారి చేత తరమబడి, ఋష్యమూక పర్వత శిఖరముల మీద కూర్చున్న సుగ్రీవుడిని రక్షించడం కోసమని ఆయనతో స్నేహాన్ని చేసుకొని, వాలిని ఒక్క బాణంతో సంహరించి, చేసుకున్న స్నేహానికి, ఒప్పందానికి నిలబడి సుగ్రీవుడిని రాజ్యమునందు ప్రతిష్టించినప్పుడైనా రావణుడి కళ్ళుతెరుచుకోలేదా.     

పోని అప్పుడు కూడా తెలుసుకోలేకపోయాడు అని అనుకుందాము. కాని విభీషణుడు ధర్మబద్ధమైన మాట చెప్పాడు ' అన్నయ్యా, నువ్వు రాముడిని నిగ్రహించలేవు, లంక అంతా నాశనమయిపోతుంది. నువ్వు చేసినది పాపపు నడువడితో కూడిన పని. నా మాట విని సీతమ్మని తీసుకెళ్ళి రాముడికి ఇచెయ్యి ' అని చెప్పాడు. విభీషణుడి మాటలు కాని రావణుడు విని ఉంటె ఇవ్వాళ లంకా పట్టణానికి ఇంతటి చేటుకాలం దాపురించేది కాదు. తోడపుట్టినవాడైన కుంభకర్ణుడు రాముడి చేతిలో చనిపోయాడు, తన కుమారులైన నరాంతకుడు, అతికాయుడు మొదలైన వారందరూ మరణించారు, మహోదర, మహాపార్షులు మొదలైనవారు మరణించారు, ఆఖరికి ఇంద్రజిత్ కూడా లక్ష్మణుడి చేతిలో మరణించాడు. ఇంతమంది చనిపోయాక కూడా వచ్చినవాడు సామాన్య నరుడు కాదన్న ఆలోచన రావణుడికి రావట్లేదే?  


ఒకానొకసారి దేవతలందరూ కూడా రావణుడు చేస్తున్న ఆగడములను భరించలేక అందరూ కలిసి బ్రహ్మగారి దెగ్గరికి వెళ్ళి ' అయ్యా! రావణుడు చేస్తున్న ఆగడాలు మేము భరించలేకపోతున్నాము, నరవానరముల చేతిలో తప్ప వాడికి ఎవరి చేతిలో చావు లేదు. ఇవ్వాళ వాడి ముందుకెళ్ళి నిలబడగలిగే ధైర్యం ఎవరికీ లేదు. సముద్రం కూడా కెరటాలతో వాడి ముందు నిలబడడానికి భయపడుతుంది, సూర్యుడు గట్టిగా ప్రకాశించడం లేదు, అలా దిక్పాలకులని కూడా శాసించగలిగే స్థితిలో ఉన్నాడు. వాడి చేతిలో లోకములన్నీ పీడింపబడుతున్నాయి, మేము ఎలా జీవించాలి ' అని అడిగారు. అప్పుడు బ్రహ్మగారు ' నేను ఇవ్వాల్టి నుంచి ఒక కట్టుబాటు చేస్తున్నాను. ఈ రాక్షసులు మూడు లోకములలోనూ తిరుగుతూ ఉంటారు, ఒక చోట ఉండరు, దానివల్ల మీకు కొంత ఉపశాంతి కలుగుతుంది ' అని అన్నారు. 


దానివల్ల ఆ దేవతలు పూర్తి ఉపశాంతిని పొందకపోవడం చేత శివుడి కోసం తపస్సు చేశారు. త్రిపురములను తన కంటి మంట చేత నశింపచేసినవాడైన పరమశివుడు ఆ దేవతలయందు ప్రీతి చెంది, వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యి ' ఇంత తపస్సు కలిగిన రావణుడు మరణించడానికి కావలసిన విధంగా, సీత అన్న పేరుతో అమ్మవారు ఉదయించబోతోంది ' అని ఆరోజున శివుడు దేవతలకి వరం ఇచ్చాడు. అందుచేత రావణుడు అపహరించి తీసుకొచ్చిన ఆ మైథిలి సాక్షాత్తుగా రావణుడి ప్రాణములను తీసుకోడానికి, ఈ లంకా పట్టణాన్ని సర్వనాశనం చెయ్యడానికి, రాక్షసులందరినీ పరిమార్చడానికి కాళ రాత్రిలా వచ్చింది. ఈ విషయాన్ని రావణుడు తెలుసుకోలేక రాముడి మీదకి యుద్ధానికి వెళుతున్నాడు " అని ఆ లంకా పట్టణంలోని ప్రజలు చెప్పుకుంటున్నారు.

ఇటుపక్కన రాముడు అలసిపోయినవాడై ' ఈ రావణుడిని అసలు ఎలా సంహరించడం ' అని ఆలోచిస్తుండగా, ఆ సమయంలో దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, ఋషులు మొదలైనవారందరూ ఆకాశంలో నిలబడ్డారు. అందరితోపాటుగా వారిలోకి గబగబా అగస్త్య మహర్షి వచ్చి " రామ! రామ! ఇప్పుడు నేను నీకు ఆదిత్య హృదయం ఉపదేశం చేస్తున్నాను, దీనిని నువ్వు స్వీకరించు. ఇది కాని నువ్వు పొందావ, ఇక నీకు ఏ విధమైన అలసట ఉండదు. ఈ పరమమంగళమైన ఆదిత్య హృదయాన్ని నీకు భయం కలిగినప్పుడు కాని, అరణ్యంలో ఉన్నప్పుడు కాని చదువుకో, నీకు రక్ష చేస్తుంది " అని చెప్పి  ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు....


 ఇప్పటికి  మన పెద్దలు చెబుతారు   ఆదిత్య హృదయాన్ని మననం చేసుకుంటే సర్వ భయాలు తొలగి  జయం చేకూరుతుంది .అనారోగ్యంగా ఉనవారికి  ఆరోగ్యం చేకురును.




1.తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం
   రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం
2.దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం
   ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః

ఈ రెండు  శ్లోకాలు అగస్త్యుడు శ్రీరాముడి వద్దకు వచ్చుట
అగస్త్య ఉవాచ:
3.రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం
   యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి
4.ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం
   జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం
5.సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం
   చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం

ఆదిత్య హృదయ పారాయణ వైశిష్టత చెప్పబడింది.
6.రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం
   పూజయస్వవివస్వంతం భాస్కరం భువనేశ్వరం
7.సర్వ దేవాత్మకో హ్యేశ తేజస్వీ రశ్మిభావనః
   ఏశ దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః
8.ఏశ బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః
   మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాంపతిః
9.పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః
   వాయుః వహ్నిః ప్రజాప్రాణా ఋతు కర్తా ప్రభాకరః
10.ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్
     సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః
11.హరిదశ్వస్సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్
     తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తండక అంషుమాన్
12.హిరణ్యగర్భహ్ శిశిరస్తపనో భాస్కరో రవిః
     అగ్నిగర్భోఅదితేః పుత్రః శంఖః శిశిరనాశనహ్
13.వ్యోమనాథ స్తమోభెదీ ఋగ్ యజుస్సామ పారగః
     ఘన వృష్టిరపాం మిత్రో వింధ్య వీథీ ప్లవంగమః
14.ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః
     కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వ భవోధ్భవః
15.నక్షత్ర గ్రహతారాణాం అధిపో విశ్వ భావనః
     తెజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే

సూర్యుడంటే బయటకు వ్యక్త మవుతున్న లోపలి ఆత్మ స్వరూపమని, బాహ్యరూపము అంత స్వరూపము ఒక్కటే.
16.నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయె నమః
     జ్యోతిర్గణాణాం పతయే దినధిపతయే నమః
17.జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః
     నమో నమస్సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః
18.నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః
     నమః పద్మ ప్రబోధాయ ప్రచండాయ నమో నమః
19.బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే
     భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషె నమః

20.తమొఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనె

     కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః

మంత్ర జపం
21.తప్త చామీక రాభాయ హరయే విష్వకర్మణే
     నమస్తమోభినిఘ్నాయ రుచయే లొకసాక్షిణే
22.నాశయత్యేష వై భూతం తదైవ సృజతి ప్రభుః
     పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః
23.ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః
     ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం
24.వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ
     యాని కృత్యాని లోకేషు సర్వేషు పరమ ప్రభుః

సూర్యుడు గురించి శ్లోక మంత్రాలు
25.ఏనమాపత్సు కృత్ శ్రేషు కాంతారేషు భయేషు చ
     కీర్తయన్ పురుషః కశ్చిన్ నావసీదతి రాఘవః
26.పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం
     ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి
27.అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
     ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం
28.ఏతత్ శృత్వా మహాతెజా నష్టశొకొభవత్తదా
     ధారయామాస సుప్రీతొ రాఘవహ్ ప్రయతాత్మవాన్
29.ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్
     త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్
30.రావణం ప్రేక్ష్య హ్రుష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
     సర్వ యత్నేన మహతా వధె తస్య ధృతోభవత్

పారాయణ వల్ల కలిగే ఫలం, పారాయణ చేయ వలసిన విధానం
31.అథ రవి రవదన్నిరీక్ష్య రామం
     ముదితమనాః పరమం ప్రహృష్యమానః
     నిశిచరపతి సంక్షయం విదిత్వా
     సురగణమధ్యగతో వచస్త్వరేతి

సూర్యభగవనుడు శ్రీ రాముడు విజయాన్ని పొందేటట్లు అశీర్వదించడం

No comments:

Post a Comment